కోట్పల్లి : మూడు రోజుల క్రితం మర్పల్లి మండలంలోని రావులపల్లి సమీపంలోని తిమ్మాపూర్ వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయిన కారు సంఘటనలో ఇద్దరు బయటపడగా, మరో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో ఇశాంత్ (8) ఆచూకీ ఇంత వరకు లభించలేదు. ఇందు కోసం మంగళవారం బార్వాద్ చెక్డ్యామ్ వద్ద ఆర్డీవో ఉపేందర్రెడ్డి, డీఎస్పీ సంజీవ్రావు, పైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు వాగుల్లో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.