వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో పీహెచ్సీ సబ్ సెంటర్ ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న గదులను పరిశీలించారు. వెంటనే వైద్య సిబ్బందితో మాట్లాడి తొందరగా ప్రాంరభించే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం 13వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో ధారూరు మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్ను శాలువాతో సన్మానం చేశారు. రైతుల అభ్యున్నతి కోసం మెరుగైన సేవలు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.