బొంరాస్పేట : మండలంలో రోడ్డు సౌకర్యం లేని గుడేల్కుచ్చతండా, గిర్కబాయితండా, మెట్టు చెల్కతండాలకు రోడ్లు నిర్మిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గిరిజనులకు హామీ ఇచ్చారు. శుక్రవారం బొంరాస్పేట పెద్ద చెరువులో చేప పిల్లలను వదలడానికి వచ్చిన ఎమ్మెల్యేకు గుడేల్కుచ్చతండాకు చెందిన మహిళలు తమకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే తండాలకు రోడ్డు నిర్మించాలంటే అటవీ భూమి గుండా వేయాల్సి వస్తుందని అనుమతి కోసం కలెక్టర్కు లేఖ రాశామని అనుమతి వచ్చిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మూడు తండాలకు రూ. 5లక్షల చొప్పున మంజూరు చేసి ఫార్మేషన్ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి గిరిజనులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మెట్లకుంట ఎంపీటీసీ నర్సింహులు పాల్గొన్నారు.