వికారాబాద్ : ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఇసాక్పాషా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి వెళ్లి ఇసాక్ పాషా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. చిన్నారుల పోషణకు ఒక లక్ష రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధైర్య పడొద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చిన్నారుల చదువుకు తన వంతు సహాయం చేస్తామన్నారు. వీలైనంత తొందరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. ఇసాక్ పాషా మృతిపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఆయ గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.