కులకచర్ల : పరిగి ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ఘనాపురం రాములు అన్నారు. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాబు గతంలో మృతి చెందాడు. రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేకు వాచ్మెన్ బాబు భార్య పరిస్థితి గురించి దేవాలయ చైర్మన్ వివరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి స్పందించి దేవాదాయ శాఖ కమీషనర్తో మాట్లాడి వాచ్మెన్ భార్య లక్ష్మికి పాంబండ దేవాలయంలో విధులు నిర్వహించేలా ఉపాధి కల్పిస్తూ దేవాదాయ శాఖ ద్వారా ఉత్తర్వులు అందించినట్లు తెలిపారు.
నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో సుధాకర్, టీఆర్ఎస్ సీనియర్నాయకులు లక్ష్మయ్య గుప్తా పాల్గొన్నారు.