తాండూరు : మతసామరస్యానికి తాండూరు నిలయమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం తాండూరులో హిందూ, ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు హిందూ ముస్లింలు కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చారిత్రక పాత తాండూరు గడిలో వినాయక ఉత్సవాల్లో ముస్లింలు పాల్గొని మతసామరస్యాన్ని చాటడం గొప్ప విషయమన్నారు. రాబోయో అన్ని పండుగలు ఇలాగే జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రాసీద్, డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ రాజేందర్రెడ్డి, హిందూ, ముస్లింలు పాల్గొన్నారు.