వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి బోనమ్మ ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం రావణుడి ప్రతిమను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్స న్ మంజులతో కలిసి దహనం చేశారు. అంతకుముందు ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాల యంలో స్వామివారికి ఎమ్మెల్యే దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామిని అశ్వవాహనంపై భక్తులు ఊరేగింపు నిర్వహించారు. వికారాబాద్ పట్టణ ప్రధాన రోడ్లపై స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
బోనమ్మ ఆలయం వద్ద ఉన్న జమ్మి చెట్టుకు పూజలు చేశారు. దసరా ఉత్సవ ఏర్పాట్లకు మున్సిపల్ నుంచి రూ. 9లక్షలకు పైగా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.