దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మండల సంస్థగత ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, వికారాబాద్ జిల్లా ఇన్చార్జి రాజ్యాసభ సభ్యుడు బండప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదావాడి గుండేలో కేసీఆర్ ఉంటారన్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని మూడు నెలలకోసారి మండల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ప్రజలు హార్షిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి సతీష్ముదిరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్రావు, టీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ బాయిరెడ్డి మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బయిరెడ్డి నరోత్తంరెడ్డి, జడ్పీటీసీ కోట్లా మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, కొడంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు భగవంతు, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మపకీరప్ప, మండల కో-ఆఫ్షన్ సభ్యులు జాకీర్అలీ సర్పంచులు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.