వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి సంబందించిన పలు విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాక్సినేషన్, ఐసోలేషన్, పర్యవేక్షణ(అబ్జర్వేషన్) గదులతో పాటు నిర్మాణంలో ఉన్న ఇతర ఆసుపత్రి గదులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ రోగుల అవసరాల మేరకు అందుబాటులో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
ప్రస్తుత వర్షాకాలం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఎలాంటి అపరిశుభ్రత నెలకొనకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆసుపత్రి వైద్యు సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదయ్య, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.