పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపంలోని చెరువులో శనివారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ కరణం అరవింద్రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మొగులంత్రెడ్డి, నరహారి, బోజీరెడ్డి, సురేశ్ చందర్రెడ్డి పాల్గొన్నారు.