కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో దుర్గామాత అమ్మవారి దగ్గర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజలు, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డిలు హాజరై పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనురాధబాల్రెడ్డి, ఎంపీటీసీ పద్మరఘుగౌడ్, జడ్పీటీసీ రాందాస్ నాయక్, గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల, పార్టీల నాయకులు పాల్గొన్నారు.