వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసిన రిజ్వాన హైదరాబాద్కు బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో డీఎల్పీవోగా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బంట్వారం మండలానికి ఈవోపీఆర్డీగా పని చేశానన్నారు. అక్కడి నుంచి చేవెళ్ల మండలానికి బదిలీ అయ్యానని, ఇన్చార్జీ ఎంపీడీవోగా పని చేశానని తెలిపారు. కుత్భుల్లాపూర్, సంగారెడ్డి, సిద్దిపేట్లో పలు పదవుల్లో పని చేశానని తెలిపారు.
2019లో సిద్దిపేటలో డీఎల్పీవోగా విధులు నిర్వహించి వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా బదిలీపై రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో అమలు అయ్యేలా కృషి చేస్తామని సూచించారు. గ్రామ పంచాయతీలపై నిరంతరం పరిశీలించి, జిల్లా యంత్రంగంతో కలిసి పనులు చేస్తామని వివరించారు. అంతకు ముందుకు బదిలీపై వచ్చిన డీపీవోకు వికారాబాద్ డీఎల్పీవో అనీత, కార్యాలయ సిబ్బంది, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, గౌరవ అధ్యక్షుడు సురేశ్, కార్యవర్గ సభ్యులు రాములు, సభ్యులు కిషన్రెడ్డి, మాణిక్, రాంచందర్, రాంరెడ్డిలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.