బంట్వారం : సమసమాజ స్థాపనకు కోసం కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్టించిన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బసవేశ్వరుడు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో మనందరం నడువాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో స్వామిజీలు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు.