వికారాబాద్ : వరద నీటిలో పడి ఇసాక్పాషా మృతి చెందడం బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలోని ఇసాక్పాషా కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులుసుమామిడి గ్రామం 7వ వార్డు మెంబర్ వరద నీటిలో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడికి ఇద్దరు కవల పిల్లలు ఉండటంతో వారిని ఆదుకునేందుకు మృతుడి భార్య సమీనాకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.
ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి వెంట రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆయా శాఖల అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు.