పూడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడ రైతు సేవకేంద్రం (ఆగ్రోస్) ద్వారా శనిగ విత్తనాలను ఎన్ఎఫ్ఎస్ఎం పథకం ద్వారా 33శాతం సబ్సిడీపై ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాటాఈ్లడుతూ ఎస్సీ, ఎస్టీ రైతులు అన్ని విధాలుగా ఆర్థిక అభివృద్ధి చెందలనద్దే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. వ్యవసాయాధికారులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలను ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా కృషి చేస్తుందన్నారు.
నియోజకవర్గంలోని రైతులు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ రాజేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.