కులకచర్ల : గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్లో ఆరోగ్య ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ను డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించేందుకు గ్రామాల్లోని ఉపకేంద్రాల్లో కూడా వ్యాక్సీన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కాగా తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అనీల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, టీఆర్ఎస్ డాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, వైద్య శిబ్బంది పాల్గొన్నారు.