దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామం రూ. 12.50లక్షల నిధులతో నిర్మించిన వైకుంఠధామంతో పాటు పల్లెప్రకృతి వనం అలాగే గ్రామంలోని వివిధ వార్డుల్లో రూ. 12లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా నియోజవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి జరుగుతుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో ముందుకెళ్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం మండలానికి చెందిన కొంతమంది లబ్ధిదారులకు ఎల్ఓసీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, దౌల్తాబాద్ సర్పంచు శీరిష రమేశ్, ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ సినీయర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, పకీరప్ప పాల్గొన్నారు.