వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో వివిధ రూపాల్లో గణపయ్య భక్తులను దర్శనిమిచ్చారు. వికారాబాద్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ ఆకారాల్లో ఉన్న గణనాథులను శుక్రవారం భక్తులు ప్రతిష్టించారు. స్వామివారిని కొలుస్తూ దూప దీప నైవేద్యాలు సమర్పించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు మండపాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథునికి జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పలువురికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు సురేష్, అనంత్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు గిరీష్కొఠారీ, షఫీ, దత్తు పాల్గొన్నారు.