మోమిన్పేట మే 11: కరోనా కట్టడికి అందరం కలిసి కట్టుగా పని చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మోమిన్పేట మండలంలో కరోనా వ్యాప్తి కరోనా నిర్మూలనకు మంగళవారం మండల ప్రజాప్రతి నిధులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి అభిప్రాయాలని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకి రావద్దన్నారు. మాస్క్ ధరించి భౌతిక దూరం పాఇంచాలని తెలిపారు. శుభకార్యాలకి, చావు లకి వీలైనంత తక్కువ మంది భౌతిక దూరం పాటిస్తూ పాల్గో నాలని సూచించారు. మండల పరిధిలోని లచ్చనాయక్ తండా ప్రజలు ప్రతి చిన్న అవసరానికి బయటకి వస్తున్నారని తద్వారా గ్రామంలో కేసులు పెరుగుతున్నాయని సర్పంచ్ తెలుపగా ఇందుకు ఎమ్మెల్యే స్పందించి లచ్చనాయక్ తండా గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశిం చారు.
కరోనా సోకిన వ్యక్తులను ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలని,అవసరమైన కిట్స్ మందులను అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు.గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న చోట కూలీలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోప్రతి రోజు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల ప్రజలు, ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పని చేసి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ఈ జూమ్ సమా వేశంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు అంజి రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.