-రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, మే 5: కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంలో అందరికీ అందజేస్తున్నారని మ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం, మైనార్టీలకు రంజాన్ కానుక లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా, పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంలో కానుకలు పంపిణీ చేస్తునట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్, తహసీల్దార్ చెన్నప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, మే5: రంజాన్ను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పండుగకు కానుకలు పంపిణీ చేయిస్తున్నారని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో ముస్లిం ఆడపడుచుల పెండ్లీలకు షాదీముబారక్తో ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను గుర్తించి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ ధారాసింగ్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్చారి, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఇందూరు ప్రకాశం, నాయకులు టి.రమేశ్, గోపాల్రెడ్డి, మండల మైనారిటీ నాయకులు ఎండీ.ఆజం ఖాన్, తహసీల్దార్ ఫహీం ఖాద్రి, డిప్యూటీ తహసీల్దార్ మోహన్, ఆర్ఐ రాజురెడ్డి, పాల్గొన్నారు.
నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.నారాయణ రెడ్డి వివాహం జరిగి 50 ఏండ్లు పూర్తి కావడంతో ఆయన నివాసంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, నారాయణ రెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కోట్పల్లిలో..
కోట్పల్లి, మే5: భక్తిశ్రద్ధలతో రంజాన్ను జరుపుకోవాలని ఎమ్మెల్సీ పీ.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.