కడ్తాల్, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని గోవిందాయిపల్లి తండా, గడ్డమీదితండాలో ఎంపీడీవో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్లు, పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం ఇంటింటికీ ఆరు మొక్కలు ఎంపీడీవో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో తేజ్సింగ్, సర్పంచ్లు రాములునాయక్, పాండునాయక్, ఉప సర్పంచ్ హంశ్య, వార్డు సభ్యులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ముమ్మరంగా పల్లె ప్రగతి
ఇబ్రహీంపట్నంరూరల్, జులై 6 : ప్రతి పల్లెను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులు పారదోలాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్నది. కప్పాడు, తుర్కగూడ గ్రామాల్లో పల్లె ప్రగతిలో ఎంపీపీ పాల్గొని మొక్కలు నాటారు.
మంచాలలో కొనసాగుతున్న పల్లె ప్రగతి
మంచాల జులై 6 : పల్లెప్రగతి గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నది. చిత్తాపూర్లో సర్పంచ్ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి కలుపు మొక్కలు తొలగించారు. ఆరుట్లలో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోఆర్డీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేయడమే కాకుండా తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు.
ప్రగతి పనుల పరిశీలన..
యాచారం, జూలై 6 : నందివనపర్తి గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం ఎంపీపీ సుకన్య, ఎంపీడీవో మమతాబాయి పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉదయశ్రీ, ఎంపీటీసీ రజిత, ఉపసర్పంచ్ గోవర్ధన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి జంగారెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి పల్లవి, కార్యదర్శి లింగం పాల్గొన్నారు.
వనంలో సీతాఫలం
మండల కేంద్రంలోని తిరుమలగుట్ట సమీపంలో ఉన్న పల్లెపకృతి వనంలో నాటిన సీతాఫలం చెట్టు కాయ కాసింది. మంగళవారం సర్పంచ్ శ్రీధర్రెడ్డి పల్లెపకృతి వనంలో పర్యటిస్తుండగా సీతాఫలం చెట్టుకు కాయ ఉండటాన్ని చూసి సంబురపడ్డారు. మండలంలోనే యాచారం పల్లెపకృతి వనం ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆమనగల్లులో..
ఆమనగల్లు, జూలై 6 : పల్లెప్రగతిలలో భాగంగా మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్, ఎంపీడీవో వెంకట్రాములు, ఎంపీవో ఉమారాణి మండలంలోని రాంనుంతలను సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి, ముర్తుజాపల్లి పట్టణంలో పట్టణ ప్రగతి కొనసాగుతున్నది. కార్యక్రమంలో సర్పంచ్ సోనా, నాయకుడు శ్రీనునాయక్, ఏఈవో మౌన్యారెడ్డి పాల్గొన్నారు.
లక్ష్యాన్ని చేరుకుంటాం
పెద్దఅంబర్పేట, జూలై 6 : మొక్కలు నాటడంలో లక్ష్యాన్ని చేరుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కౌన్సిలర్ గీత అన్నారు. పట్టణప్రగతిలో భాగంగా 16వ వార్డు తట్టిఅన్నారంలోని పలు వీధుల్లో, శ్మశానవాటికలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్, డీఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
తలకొండపల్లి జులై 6 : పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీవో రవీందర్రెడ్డి అన్నారు. పంచాయతీల్లో పల్లెప్రగతిలో భాగంగా వాటర్ ట్యాంకుల పరిశుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. వెల్జాల్, తలకొండపల్లి, చీపునుంతలలో సర్పంచ్ గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు.