కడ్తాల్, జూన్ 20: ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలంలోని కొల్కులపల్లి గ్రామానికి చెందిన శివకి రూ.16 వేలు, గోపమ్మకి రూ.16 వేలు, భారతమ్మకి రూ.24 వేలు ముఖ్యమంత్రి సహాయనిధుల చెక్కులు మం జూరయ్యాయి. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, లబ్ధిదారు లకు చెక్కులను ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
షాద్నగర్టౌన్ జూన్ 20: పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నదని కేశంపేట మండల ఎంపీపీ వై. రవీందర్యాదవ్ అన్నారు. మండ లంలోని అల్వాల్ గ్రామానికి చెందిన నారాయణ, చింతకుంటపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, పోమాలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించు కున్నారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా నారాయణకు రూ. 60వేల, జంగ య్యకు 16వేల, శ్రీనివాసులుకు రూ. 10వేల, లక్ష్మణ్కు రూ. 20వేల చెక్కులను ఆది వారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం
యాచారం, జూన్20: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలారి మల్లేశ్ అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పంతం లక్ష్మమ్మ అనే మహిళ ఇటివల అనారోగ్యానికి గురయ్యింది. వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా రూ.36,000ల మంజూరు అయ్యాయి. చెక్కును ఆదివారం బాధితురాలికి సర్పంచ్ సంతోషతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భారతమ్మ, దశరథ టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, మైసయ్య, మహేశ్, శ్రీకాంత్, వెంకటయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటికి వెళ్లి చెక్కు అందజేత
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 20 : పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరమని అబ్దుల్లాపూ ర్మెట్ మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు నారోజు రాజారాంచారి, ఎడ్ల మహేందర్ అన్నారు. మండలంలోని మజీద్పూర్ గ్రామానికి చెందిన పాశం యాదమ్మ అనారోగ్యంతో బాధ పడుతూ దవాఖానలో చికిత్స చేయించుకున్నారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా పాశం యాదమ్మకు మంజూరైన రూ. 14వేల చెక్కు ను ఆదివారం ఆమె నివా సానికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోప గోని నాగరాజుగౌడ్, పాశం , ఎడ్ల నవీన్ముదిరాజ్, పాశం శ్రీను ఉన్నారు.