ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ప్రభుత్వం జాతీయ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. యువత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు రావాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లేనన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటరుగా నమోదు చేసుకున్న యువతకు ఓటర్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ప్రశాంత్కుమార్, జడ్పీసీఈవో దిలీప్కుమార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో కా్రంతికిరణ్, తహసీల్దార్ అనిత, వైద్యాధికారి అభిరాం, ఎంఈవో వెంకట్రెడ్డి, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, గీతారాంరెడ్డి, మల్లీశ్వరి, ఆండాళు, కవిత, ఎంపీటీసీ మంగ, కౌన్సిలర్ శ్రీలత ఉన్నారు.
18 ఏండ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
షాబాద్, జనవరి 25 : 18 సంవత్సరాలు నిండినవారు తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ‘భారతదేశ పౌరులమైన మేము.. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడుతామని, మతం, కులం, వర్గం ఎటువంటివాటికి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తా’మని వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్చంద్ర యొక్క సందేశం వినిపించారు. ఈ సందర్భంగా ఓటర్ల దినోత్సవం సందర్భంగా ముగ్గురు సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఓటర్లుగా నమోదైనవారికి ఎపిక్ కార్డులను అందజేశారు. సమావేశంలో డీఆర్వో హరిప్రియ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, సీపీవో ఓంప్రకాశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.