పరిగి/షాబాద్ జనవరి 25: వికా రాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 73వ గణతంత్ర దినో త్సవ శు భాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిం దని, స్వాతంత్య్రం ఎంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతక డానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందుతు న్నా యంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశం అని మంత్రి తెలిపారు. విధులు పా టిస్తూ హక్కులను అనుభవిస్తూ దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. భారతా వనికి మహనీయులు అందిం చిన త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచం లోనే అత్యంత బలమైన రాజ్యాంగాన్ని మనకు అం దించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను యావత్ జాతి మననం చేసు కోవాల్సిన అసవరం ఉందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయ కత్వం లోని ప్రభుత్వం రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందిం చడానికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తుం దని మంత్రి తెలిపారు.