కొత్తూరు, జనవరి 25: కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. మొదట కుమ్మరిగూడలో తాగునీటి ఫిల్టర్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. మొదట గ్రామస్తులు ఓ ప్రాంతంలో ఫిల్టర్ ఏర్పాటుకు స్థలాన్ని సేకరించి నిర్మాణాన్ని ప్రారంభిచారు. అది ఎల్టీఎల్ పరిధిలో ఉండటంతో దాన్ని రెవెన్యూ అధికారులు తొలగించారు. అనంతరం మరో స్థలాన్ని ఎంపిక చేసేందుకు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కొత్తూరు మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా భవనాన్ని నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని అక్కినేనిగూడకు చెందని సోలీపూర్ ప్రదీప్ 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సోలీపూర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, మైసిగళ్ల రమేశ్, మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్రెడ్డి, మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్, బ్యాగరి యాదయ్య, మేకల రాఘవేందర్ పాల్గొన్నారు.