ఆమనగల్లు(మాడ్గుల) 25 : రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మాడ్గుల మండలం రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాజీ జడ్పీటీసీ రవితేజ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో కేఎల్ఐ, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా భూములకు సాగు నీరు పారుతుందన్నారు . వానకాలం సాగు కల్లా నాగిళ్ల వరకు కృష్ణజలాలు పారుతాయని ఆయన హామీచ్చారు. కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డి పల్లి నుంచి మాడ్గుల మండలంలోని నాగిళ్ల వరకు అసంపూర్తి కాల్వ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 59 కి.మీ వరకు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ రూ. 180 కోట్ల నిధులు కేటాయించారన్నారు. రైతులకు పెండింగ్ బకాయిలను ఇప్పటికే రూ.40 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే మాడ్గుల మండల రైతులకు రూ.20 కోట్ల నిధులు విడుదల అవుతాయన్నారు. రైతుబంధు సమితి అధ్యక్షులు,గ్రామ కమిటీల సభ్యులంతా రైతుల కోసం పని చేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి గౌతమ్ రైతుబంధు సమితి అధ్యక్షుడు రవితేజ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, జోత్యిరావుపూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ శంకర్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, జైపాల్నాయక్, భాస్కర్రావు, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, డైరెక్టర్లు నిరంజన్, సుభాశ్, వరుణ్, చలమంద, మహేశ్, విష్ణు, సర్పంచ్లు జంగయ్య, శ్రీను, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని మాదయపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్గౌడ్కు రూ. 2.50 లక్షల ఎల్వోసీని మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి దళితబంధును తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన దళిత ప్రజాప్రతినిధులు, ఆర్డీవోతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అట్టడుగుస్థాయిలో ఉన్న దళితులను అభివృద్ధి పథంలో తీసుకురావాలన్న లక్ష్యంతో దళితబంధు పథకా న్ని తీసుకువచ్చారన్నారు. దళితబంధు పథకంపై ప్రతి పక్షాలు ఇప్పటివరకు నోటికొచ్చినట్లు మాట్లాడాయని, ఇకముందు దళితబంధుపై మాట్లాడే అర్హత ఎవరికీ లేద న్నారు. దళితబంధును మొదటగా ముఖ్యమంత్రి ప్రయో గాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టారని, అది విజయ వంతం కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చారని తెలిపారు. దళిత ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఉన్న అర్హులైన దళితులను గుర్తించి వారికి సహాయం అందించేలా కృషి చేయాలన్నారు. దళితబంధు ఎంపికలో పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. దశల వారీగా ఈ పథకాన్ని నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పలువురు దళిత కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
పెద్దఅంబర్పేట : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. పెద్దఅంబర్పేటకు చెందిన ఎస్ చినమ్మకు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రేణుక, బలరాం, నాగార్జున ఉన్నారు.