వికారాబాద్, ఏప్రిల్ 16 : ధారూరు మండలం గడ్డమీదిగంగారంకు చెందిన ఎల్క నర్సింహులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ తరుణంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి హాజరుకాగా.. ఆ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ తన పర్సులో ఉన్న రూ.38వేలను ధారూరు పీఎసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్రెడ్డికి అందించగా.. బాధితుడి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేశారు.