కొత్తూరు రూరల్, జూన్ 7: మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామంలో అభివృద్ధి బాగుందని సర్పంచ్ అజయ్నాయక్ను ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అభినందించారు. గ్రామంలో ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులను నిర్వహించి జిల్లాస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు. సోమవారం ఇన్ముల్నర్వ గ్రామంలో సర్పంచ్ అజయ్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, పల్లెప్రకృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు చేకూరుస్తున్నదని అన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, పార్క్ను తలపించేలా ఉందని అన్నారు. పల్లెప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉందన్నారు. ప్రజలు మార్నింగ్, ఈవినింగ్ వాక్కు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, వైస్ఎంపీపీ శోభలింగం, ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మిట్టునాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, పంచాయతీ కార్యదర్శి అలివేలు, నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎస్.యాదగిరి, లింగంనాయక్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.