కొత్తూరు, ఏప్రిల్8 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తిమ్మాపూర్ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతకింది రాజేందర్గౌడ్ మరో 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డితో కలిసి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ చేరుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ధిపొందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో పల్లెలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, ఏనుగు జనార్దన్రెడ్డి, కోస్గి శ్రీను, సుఖేందర్రెడ్డి, మాధవరెడ్డి, దేవేందర్గౌడ్, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.