వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని జిల్లా కలెక్టర్ నిఖిల తన కుమారుడితో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్కు జ్ఞాపికను అందజేశారు. ఆలయం చాలా బాగుందని కలెక్టర్ కితాబిచ్చారు.