దౌల్తాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు (మినిట్యాంక్బండ్)లో 2లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత చేపపిల్లల పంపిణీతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని, తెలంగాణలో ప్రస్తుతం నీలి విప్లవానికీ శ్రీకారం చూట్టారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గుక్కెడు మంచినీళ్ల కోసం గోస పడ్డప్రాంతం ఇప్పుడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతుందన్నారు.
తెలంగాణలో ఎక్కడ చూసిన ధాన్యపు సిరులు, మత్స్య సంపద పెరుగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో దిగుమతి చేసే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు.