వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అనంతపద్మనాభస్వామిని గజవాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు.