రంగారెడ్డి, మే 27, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సూపర్ స్ప్రెడర్స్కు నేటి నుంచి వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30 వరకు మూడు రోజులపాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని సూపర్ స్ప్రెడర్స్కు మాత్రమే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అర్బన్ ప్రాంతంలోని సూపర్ స్ప్రెడర్స్కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లాలోని మండలాల వారీగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు, రేషన్ డీలర్లతో పాటు సిబ్బంది, ఎరువులు, విత్తనాల డీలర్లతోపాటు సిబ్బంది, ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కోసం జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని సూపర్ స్ప్రెడర్లకు ఒక కౌంటర్, జర్నలిస్టులకు ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వ్యాక్సినేషన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకుగాను అవసరమైన స్టాఫ్ నర్సులతోపాటు నర్సింగ్ సిబ్బందిని ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రానికి కేటాయించారు. సూపర్ స్ప్రెడర్లలో భాగంగా జిల్లాలోని అక్రిడిటేషన్ జర్నలిస్టులకూ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. లాక్డౌన్లోనూ పనిచే స్తున్న జర్నలిస్టులకు కూడా టీకా ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లు 9139 మంది ఉండగా, వీరిలో రేషన్ డీలర్లు, సహాయకులు 1838, ఎల్పీజీ సిలిండర్ సిబ్బంది 676, పెట్రోల్ బంక్లసిబ్బంది-4130, జర్నలిస్టులు-928, ఎరువులు, విత్తనాల డీలర్లతోపాటు సిబ్బంది 1567 మంది ఉన్నారు. జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో 40 వేలకుపైగా సూపర్స్ప్రెడర్స్ ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, మే 27 : కరోనా కట్టడి కోసం ముందుగా సూపర్ స్ర్పైడర్లకు టీకాలు వేసేందుకు వికారాబాద్ జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల్లో వీరికి టీకాలు వేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లాలో 3014 మంది సూపర్ స్ర్పైడర్లు ఉండగా, 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేషన్ డీలర్లు, సహాయకులు, ఎల్పీజీ గ్యాస్ పంపిణీ దారులు, పెట్రోల్ బంక్లలో పనిచేసేవారు, అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు, మద్యం దుకాణాలు, బార్లలో పనిచేసే వారికి టీకాలు వేయనున్నారు. నిత్యం ప్రజలతో కలిసి ఉండేవారికి టీకాలు వేస్తే కరోనా వ్యాప్తి తగ్గుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన సూపర్ స్ర్పైడర్లకు టీకా వేసిన తర్వాత మిగిలిన ఇతర వర్గాల వారికీ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొన్నది. ఇదిలావుండగా 45 ఏండ్లు పైబడిన వారిలో మొదటి డోసు టీకా తీసుకున్న వారికీ రెండో డోసు టీకా సైతం ఇవ్వనున్నట్లు తెలిపింది.