కొడంగల్, మే 26: లాక్డౌన్లో వైద్య, రెవెన్యూ, పోలీ సు, సఫాయి కార్మికుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మధుసూధన్యాదవ్ మ ధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని పోలీసులకు భోజనాలను వడ్డించారు. గత 15 రోజులుగా పోలీసులు నిర్విరామంగా సేవలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేశ్ బాబుతో పాటు డాక్టర్ నవాజోద్దిన్, శ్రీమన్రావు, రాహుల్, నీలి నారా యణ తదితరులు పాల్గొన్నారు.
శశి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
ధారూరు, మే 26: శశి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు ఆహార పొ ట్లాలను ఫౌండేషన్ స భ్యుడు జైపాల్రెడ్డి, ధా రూరు సీఐ తిరుపతి రాజు, ఎస్ఐ సురేశ్ పంపిణీ చేశారు. బుధవారం ధారూరు మండల కేం ద్రం లోని వికారాబాద్-తాండూరు ప్రధాన రో డ్డుపై లారీ డ్రైవర్లకు ఆహారాన్ని అందించారు. కార్యక్రమం లో ఏఎస్ఐ మురళీ ఇతర సిబ్బంది ఉన్నారు.