కొడంగల్, మే 26: మండలంలోని అప్పాయిపల్లి, ఉడి మేశ్వరం గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో మోహన్లాల్తో పాటు ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడు తూ కరోనా నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటిస్తూ ఉపాధి పనుల్లో పాల్గొనాలని సూచించారు. కొలతల ప్రకారం పనులు పూర్తి చేయాలని తెలిపారు. అప్పాయిపల్లిలో ఉపాధి పనుల్లో భాగంగా 300 మంది కూలీలతో చెరువులో కొనసాగుతున్న పూడిక తీత పనులను పరిశీలించి సూచనలు సలహాలను అం దించారు. అప్పాయిపల్లిలో వైకుంఠధామం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్ల్లు తెలిపారు.
నర్సరీ పనులను పరిశీలించిన డీఎఫ్వో
బంట్వారం, మే 26: మండల కేంద్రంలో చేపట్టిన ఆర్ అండ్బీ రెవెన్యూ నర్సరీలో లక్షా 20 వేల మొక్కల పెం పకం పనులను డీఎఫ్వో వేణుమాధవ్ బుధవారం పరిశీలించారు. ప్రస్తుతానికి అన్ని మొక్కలు ఏపుగా పెరు గుతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు.