కడ్తాల్, మార్చి 25 : పేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన దీపిక రూ.33 వేలు, మంజులకు రూ.49,500లు, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన సునీతకు రూ.22 వేలు, పర్వతాలు యశోదకు రూ.16 వేలు, మాడ్గుల్ మండలం అవురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్కు రూ.22 వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాధ్యక్షులు నిట్ట నారాయణ, నాలాపురం శ్రీనివాస్రెడ్డి, నాయకులు జంగయ్యగౌడ్, భాస్కర్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేదలకు అండగా సహాయ నిధి
ఇబ్రహీంపట్నం, మార్చి 25 : పేదలకు సీఎం సహాయనిధి పథకం అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అందుగుల సాయికుమార్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీని వారి కుటుంబ సభ్యులకు, యాచారం మండలం నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన ఆండేకార్ పద్మకు మంజూరైన రూ.40వేల చెక్కును క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బలదేవ్రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, విజేందర్రెడ్డి, నిరంజన్రెడ్డి, నిట్టు జగదీశ్వర్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఆమనగల్లు, మార్చి 25 : మండలంలోని సండ్రలగడ్డ తండాకు చెందిన తారికి మంజూరైన రూ.34 వేల సీఎం రిలీఫ్ చెక్కును ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయన నివాసంలో లబ్ధిదారు భర్తకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శేషు, సురేందర్రెడ్డి, విజయ్ పాల్గొన్నారు.