షాబాద్, మే 24: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఊహించనిరీతిలో బోరుబావుల కింద వరిసాగు చేపట్టడంతో గన్నీ సంచుల కొరత ఏర్పడిందని, త్వరలో మండలానికి కావాల్సిన గన్నీ సంచులు పంపించాలని సంబంధిత మార్కెటింగ్శాఖ అధికారులకు ఫోన్లో వివరించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్న స్వప్నానర్సింహారెడ్డి, మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామస్వామి, ఏఈవో రాఘవేందర్, వీఆర్వో గోపాల్, సిబ్బంది తదితరులున్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజేందర్రెడ్డి, సత్యం, కిష్టయ్య పాల్గొన్నారు.
రైతులకు ఎలాంటి సమస్య రానివ్వొద్దు
షాద్నగర్టౌన్ మే 24: వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి సమస్య రానివ్వొద్దని షాద్నగర్ వ్యవసాయశాఖ ఏడీ రాజారత్నం సంబంధిత అధికారులకు సూచించారు. షాద్నగర్ మార్కెట్యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి అధిక లాభాలు పొందాలన్నారు. నాణ్యమైన ధాన్యానికి రూ. 1888 మద్దతు ధర ఉన్న విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ముందుగానే రైతులకు తెలియజేయాలని అధికారులకు ఆయన సూచించారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని పలువురు రైతులు అధికారులకు వివరించారు. దీంతో బ్యాగుల కొరత విషయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నిఖిల్రెడ్డి, పీఏసీఎస్ అధికారులు పాల్గొన్నారు.