50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు
ప్రజలకు కరోనాపై జాగ్రత్తలు సూచిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్
మోమిన్పేట, మే 22: కరోనా కష్ట కాలంలో పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి చేస్తున్నారు. మోమిన్పేట జూనియర్ కళాశాలలో 50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ప్రారంభించారు. మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ప్రతిఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని సూచిస్తున్నారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులు తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో ఉండలేక ఇబ్బందులకు గురవుతున్నారని గమనించి ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయించారు. ఆందులో చికిత్స పొందుతున్న వ్యక్తులకు పౌష్టికాహారంతో పాటు వినోదం కోసం న్యూస్ పేపర్, టీవీలు పెట్టించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.