పరిగి, మే 17: మండలంలోని మిట్టకోడూరు గ్రామంలో సర్పంచ్ పటేల్ జయలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయడం పట్ల రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా ఖర్చులు మిగులుతున్నాయని, తమ కష్టానికి ఫలితం దక్కుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవో నిఖిత, ఎంపీటీసీ జహీరాబీ, రైతు సంఘం అధ్యక్షుడు బాబయ్య, గ్రామపెద్దలు పటేల్ జగదీశ్వర్, రాజలింగంగౌడ్, మక్తల మల్లయ్య, గుడాల మల్లయ్య పాల్గొన్నారు.
పోతిరెడ్డిపల్లిలో ..
మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ మండల నాయకుడు రాఘవేందర్రెడ్డి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు గోవర్దన్రెడ్డి, హన్మంతు, బాల్య, సీసీలు జంగయ్య, నారాయణ, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.