కోట్పల్లి, మే 17: మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. ఉదయం 10 గంటలు దాటితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. లాక్డౌన్ అమలుచేయడం ఎంతో మేలు చేసిందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్లో..
కొడంగల్, మే 17: కరోనా కట్టడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను స్థానిక పోలీసులు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. 10 గంటల తరువాత రోడ్లపైకి వస్తే కేసులు, జరిమానాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఎస్ఐ సమ్యానాయక్ తెలిపారు. సోమవారం 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి, నిబంధనల మేరకు జరిమానాలు విధించారు.
మోమిన్పేటలో..
మోమిన్పేట, మే17: మండలంలో 6వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. 10 గంటల తర్వాత దుకాణాలు మూతపడడంతో ప్రజలందరూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. అన్ని గ్రామాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.