బంట్వారం, మే16 : ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని శ్రీసాయి ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. బాధితులతో ముచ్చటిస్తూ, మనోధైర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రోగులకు మనోధైర్యం ముఖ్యమన్నారు. అనంతరం రోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ ప్రవళిక, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్కుమార్, కోఆప్షన్ సభ్యులు షకీల్, వైద్యాధికారి రాజశేఖర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఉచితంగా ఆక్సిజన్లు అందజేత
వికారాబాద్ శ్రీసాయి ఐసొలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న 8 మంది రోగులకు ఉచితంగా ఆక్సిజన్ను జేకేఎంఆర్ సంస్థ అందించింది. కొవిడ్ బారిన పడి ఆక్సిజన్ అత్యవసరమున్న వారికి తమ సంస్థ ద్వారా అందిస్తామని యాజమాన్యం తెలియజేసింది.