కొడంగల్, మే 13: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, ప్రజలు పూర్తిగా సహకరించాలని సీఐ అప్ప య్య పేర్కొన్నారు. లాక్డౌన్లో భాగంగా గురువారం పట్టణ అం బేద్కర్ కూడలిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరిం చారు. శుక్రవారం జరిగే రంజాన్ వేడుకను ముస్లిం సోదరులు ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని, ప్రత్యేక ప్రార్థనలు కూడా ఇంట్లోనే చేపట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈద్గా ప్రదేశాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవని, ఈద్గాల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
బొంరాస్పేటలో …
బొంరాస్పేట, మే 13 : మండలంలోని తుంకిమెట్ల వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితో పాటు మండల కేంద్రంలో వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు దుకాణాలకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేసి ఆ తరువాత ఇళ్లకే పరిమితమయ్యారు. 10 గంటల తరువాత జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బ్యాంకులు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పని చేశాయి.
మోమిన్పేటలో …
మోమిన్పేట: ప్రభుత్వం విధించిన 10 రోజుల లాక్డౌన్లో భాగంగా మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామా ల్లో విధులు,రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.లాక్డౌన్ సడ లింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు కావడంతో గురువారం మండల ప్రజలు తమకు కావాల్సిన నిత్యా వసర సరుకులు తీసుకునేందుకు రోడ్లపైకి వచ్చారు.10 తరువాత ప్రజలంత ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. రోడ్లపైకి వచ్చిన వాహనాలు ఎస్సై శేఖర్గౌడ్ తనిఖీలు నిర్వహించి,అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుం టామని వాహన దారులకు అవగహన కల్పించారు.