తాండూరు, /తాండూరు రూరల్ మే 13: లాక్డౌన్లో భాగంగా గురువారం తాం డూరు నియోజకవర్గం వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం కూరగాయల మార్కెట్, పాలు, పెరుగు, మాంసహార దుకాణాలతో పాటు కొన్ని కిరా ణా దుకాణాలు తెరుచుకున్నాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజ లు గుమిగూడడంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీసులు వెం టనే అక్కడికి చేరుకొని జనాలను చదరగొట్టి షాపులు మూ యించారు. ఎక్కువ రేట్లకు అమ్మకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకున్నారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెల్లో ప్రజలు గుమిగూడకుండా పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. తాండూరు-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కొత్లాపూర్ చెక్పోస్టు దగ్గర పోలీసులు కట్టడి చేశారు. వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేసి పంపించారు. ఉదయం 10 గంటల తర్వాత తెరిచి ఉన్న రెండు పెట్రోల్ పం పులు 4 దుకాణాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 200 వాహనాల వరకు జరిమానాలు విధించినట్లు తెలిపారు.
పరిగిలో పకడ్బందీగా
రెండవ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. రైతుల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎరువుల దుకాణాలకు సడలింపు ఉండటంతో పట్టణంలో ఓ ఎరువుల దుకాణం రైతుల కోసం తెరిచారు. 10 గంటల తర్వాత నిత్యం రద్దీగా ఉండే మార్కెట్రోడ్డు, గంజ్రోడ్డు నిర్మానుష్యం గా మారాయి. మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.
పూడూరులో ప్రశాంతంగా
మండల పరిధిలో ప్రశాంతంగా లాక్ డౌన్ కొనసాగింది. చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు పై వచ్చే వాహనాలను తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దు హైవే రోడ్డు అంగడి చిట్టంపల్లి స్టేజీ వద్ద ప్రత్యేక చెక్ పోస్టును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి జిల్లాలోకి వచ్చే వ్యక్తు లు రావడానికి కరాణలను అడిగి తెలుసుకుంటున్నారు.
కులకచర్లలో..
కులకచర్ల మండల కేంద్రంతో పాటు వివిద గ్రామాల్లో రెండవ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొ నసాగింది. మధ్యాహ్నం సమయంలో కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో జనాలు ఎవ్వరు లేక పోవడంతో చౌరస్తా నిర్మా నుష్యంగా మారింది. ఈ సందర్భంగా యువకులకు కరోనా పైన అవగాహన కల్పించారు.
యాలాల మండలంలో..
యాలాల మండలంలో లాక్డౌన్ అమ లు చేస్తున్నారు. మండల పరిధిలో ఎస్ఐ సురేశ్, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ లాక్డౌన్ నియమ నిబంధనలు వివరిస్తున్నారు. గురువారం లాక్డౌన్ రెండవ రోజు రహదారులు నిర్మానుష్యంగా మారాయి.