షాబాద్, మే 12 : గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, టీఎస్ఐఐసీ, ఏయిర్ పోర్టుల నుంచి వసూలు అయ్యే గ్రంథాలయ పన్నులను చెల్లిం చాలని కోరారు. అందులో భాగంగా శంషాబాద్ ఏయిర్ పోర్టు అధికారి కృష్ణప్రసాద్ 2020-2021వ సంవత్సరానికి గ్రంథాలయానికి చెల్లిం చాల్సిన 46లక్షల, 34లవేల, 942రూపాయలను బుధ వారం ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రంథాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న దని తెలిపారు. గ్రంథాలయాలకు రావాల్సిన పన్ను లను చెల్లించి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ తరుఫున ఏయిర్పోర్టు అధికారులకు చైర్మన్ ధన్యవాదాలు కార్యక్రమంలో సంస్థ అధికారులు పాల్గొన్నారు.
నర్సుల సేవలు వెలకట్టలేనివి
నర్సుల సేవలు వెల కట్ట లేనివని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ కప్పాటి పాండురంగారెడ్డి తెలిపారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పుసరస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో విధు లు నిర్వహిస్తున్న వెంకటమ్మ, లక్ష్మమ్మ, సం తో షలను సన్మానించారు. ఈ సందర్భంగా మా ట్లా డుతూ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేం దుకు నర్సులు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆపత్కాల సమ యంలో కరోనా బారిన పడిన వారికి కొండంత అండగా నిలుస్తున్నారని వివరించారు. వారిని కంటికి రెప్పలా కాపాడు తున్నారని అన్నారు. వారి సేవలు ఎన్నటికీ మరిచి పోలేమని పేర్కొన్నారు.