వికారాబాద్, ఏప్రిల్ 11 : కులరహిత సమాజం కోసం, మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుకొని ఎదిగేందుకు కృషి చేసిన గొప్ప మహనీయుడు జ్యోతిరావుఫూలేను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే 195 జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ ఫూలే ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని తెలిపారు. స్త్రీలకు సముచిత స్థానం కోసం జ్యోతిరావు ఫూలే ఎంతో కృషి చేశారని తెలిపారు. మహిళలు చదువుకునేందుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎస్పీ ఎం.నారాయణ, అదనపు కలెక్టర్ చంద్రయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, డీడబ్ల్యూవో లలితకుమారి, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాలకు ఆదర్శప్రాయుడు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆదర్శప్రాయుడు మహాత్మ జ్యోతిరావుఫూలే అని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 195 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని.. కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, డీఎస్బీ సీఐ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలి
అణగారిన జాతులకు మేధా సంపత్తిని అందించిన సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావుఫూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జ్యోతిరావుఫూలే 195వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జాతులను మేధా సంపత్తి వైపు మళ్లించి వారి జీవితాల్లో పూల బాట వేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. మహిళా జాతి అభ్యుదయానికి అహర్నిశలు శ్రమించిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు బాబురావు, పవన్కుమార్, నవాబుపేట, కోట్పల్లి, బంట్వారం, మోమిన్పేట మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ శాఖ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షుడు బాబ్యానాయక్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పూలే అడుగుజాడల్లో నడుచుకోవాలని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.
వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తా ఎన్నెపల్లిలో ఫూలే విగ్రహాన్ని వచ్చే ఏడాది వరకు ఏర్పాటు చేయాలని వీడీడీఎఫ్ నాయకులు శుభప్రద్పటేల్, శ్రీనివాస్ ఆదివారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసును కోరారు. ఈ సందర్భంగా వారు ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
వికారాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో …
వికారాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, కొత్తపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జాయింట్ సెక్రెటరీ జావిద్, కార్యదర్శులు శేఖర్, రాజు, కార్యనిర్వహణ కార్యదర్శి ఎన్కతల రవీందర్, సభ్యులు గైబులు, జగదీశ్, నాగిరెడ్డి, వెంకట్, ప్రమోద్, దేవేందర్, శ్రీకాంత్, అశోక్, మహేందర్, చారి పాల్గొన్నారు.
బడుగుల ఆశాజ్యోతి ఫూలే
బొంరాస్పేట, ఏప్రిల్ 12 : మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, సమాజంలో కుల నిర్మూలన కోసం, అణచివేతకు గురైన బలహీన వర్గాల ప్రజలకు ఆత్మైస్థెర్యం కల్పించి వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకుడు చంద్రప్ప, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, ఎల్హెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యానాయక్, విద్యా వలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో, నాందార్పూర్లో వేడుకలను నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనకు, బాలికా విద్యకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.