కులకచర్ల, మే 10: కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకు నేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూ పొందిస్తున్నదని, సూపర్ స్ప్రెడర్లలపై ప్రభుత్వం దృష్టి సారించిందని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గ్రా మాల్లో, పట్టణాల్లో సూపర్ స్ప్రెడర్ల వలన కొవిడ్ వ్యాప్తి జరుగుతున్నదని ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లాలోకూడా సూపర్ స్ప్రెడర్లకు త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ అందిం చేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా వీధివ్యా పారులు, ఆటో డ్రైవర్లు, ఆన్లైన్ఫుడ్, డెలివరీ బాయ్స్, రేషన్ డీలర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వంటివారు నిత్యం ప్రజల్లో ఉంటారని భావించి సీఎం కేసీఆర్ ముందు చూపుతో వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారని అన్నారు. కొవిడ్ టీకా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చునని ఆయన తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రికి వ్యాక్సిన్ అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మొదటి డోసు కొవిడ్ టీకా తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయ కులు శేరిరాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాం లాల్, వైద్యాధికారి డాక్టర్ మురశీకృష్ణ, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.