కొడంగల్, మే 9: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 760మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాండూరు జిల్లా దవాఖానలో 195 మందికి, జిన్గుర్తిలో 27మందికి, యాలాల్లో 25మందికి, బషీరాబాద్ 50మందికి, పరిగి పరిధిలో చిట్యాల 50 మందికి, కుల్కచర్లలో 60మందికి, పూడూర్లో 25మందికి, చన్గోమూల్లో 16మందికి, నాగసముందర్లో 14మందికి, ధారూర్లో 29మందికి, మోమిన్పేట్ 31మందికి, రామయ్యగూడలో 58మందికి, మర్పల్లిలో 43మందికి, బంట్వారంలో 15మందికి, కోట్పల్లిలో 12మందికి, కొడంగల్, బొంరాస్పేట పరిధిలో 53 మందికి, దౌల్తాబాద్లో 57మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేస్తున్నారు. కేంద్రాల వద్దకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా సిబ్బంది ఏర్పాట్లు చేశారు.