వికారాబాద్,ఏప్రిల్ 9 : జిల్లాలో 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
పూడూరులో టీకా పంపిణీ..
పూడూరు, ఏప్రిల్ 9 : ప్రభుత్వం సూచనల మేరకు 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్లు, వైద్యసిబ్బంది ఉన్నారు.
కులకచర్లలో 17..
కులకచర్ల, ఏప్రిల్ 9 : కులకచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 181 మందికి కరోనా టెస్టులు చేయగా 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు కులకచర్ల మండల వైద్యాధికారి మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్ తెలిపారు. మండల పరిధిలోని వీరాపూర్ 1, అంతారం తండా 1, బజ్జనాయక్తండా 1, మందిపల్ 1, కులకచర్ల 2,(దోమ మండలం మైలారం 4), అడవివెంకటాపూర్ 2, చాపలగూడెం 1, బొంరెడ్డిపల్లి 2, సాల్వీడ్ 1, సాల్వీడ్ తండా 1 కేసులు నమోదైనట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించామని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం సాల్వీడ్ తండాలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్యులు, పోలీసులు అవగాహన కల్పించారు.
పరిగిలో 13 మందికి..
పరిగి, ఏప్రిల్ 9 : పరిగి క్లస్టర్ దవాఖాన, చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 218 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు చిట్యాల్ పీహెచ్సీ ఇన్చార్జి గౌసొద్దీన్ తెలిపారు. రుక్కుంపల్లిలో 6, పరిగి పట్టణలోని ప్రేమ్నగర్ కాలనీలో 2, శ్రీనివాస్నగర్ కాలనీలో 2, శాంతినగర్, హౌసింగ్బోర్డు, బ్రాహ్మణవాడలో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
దోమలో 102 మందికి టీకా
దోమ, ఏప్రిల్ 9 : మండలంలో 102 మందికి టీకా వేశామని వైద్యాధికారి మునీబ్ తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 45 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేశామన్నారు. కరోనా టెస్టుల్లో భాగంగా 104 మందికి టెస్ట్ నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. సర్పంచ్లు శ్రద్ద వహించి ప్రతి రోజూ వ్యాక్సినేషన్కు ప్రజలను పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆధ్యాత్మిక కేంద్రాలను శానిటైజ్ చేయాలి
తాండూరు, ఏప్రిల్ 9 : ఉగాది, రంజాన్ పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని దేవాలయాలు, మసీదుల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ చేయాలని కోరుతూ శుక్రవారం కౌన్సిలర్లు సోమశేఖర్, శ్రీనివాస్రెడ్డి, ఆసీఫ్, ప్రభాకర్గౌడ్, మధుబాల, మమత మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, ఆర్డీవో ఆశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.
దిర్సంపల్లిలో అవగాహన..
దోమ, ఏప్రిల్ 9 : కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దని సర్పంచ్ శాంతారెడ్డి అన్నారు. దోమ మండల పరిదిలోని దిర్సంపల్లి సర్పంచ్ శాంతారెడ్డితో కలిసి ఎస్సై దేవంబొట్ల రాజు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మాస్క్ ధరించకుండా బయటికి వస్తే జీవో-68 ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ నవాజ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొండారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
లబ్ధిదారుల వద్దకే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే సండ్ర
బాధిత కుటుంబాలకు సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ