విధిగా వివరాలు తెలియజేయండి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
ఇంటింటా సర్వే పర్యవేక్షణ
వికారాబాద్, మే 8 : సిబ్బందికి వివరాలు తప్పనిసరిగా వెల్లడించి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 14 వార్డులో నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. అవసరమైనవారికి టెస్టులు, వైద్య సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్ మండలం సిద్దులూరు ప్రాథమిక ఆరోగ్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ప్రస్తుతం రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకునేవారికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మొదటి డోస్ వ్యాక్సినేషన్ కూడా చేపడుతామన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, కమిషనర్ బుచ్చయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.