పరిగి, మే 3 : ప్రతి గింజ కొనుగోలుకు సర్కారు సిద్ధంగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీంతో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర వస్తుందన్నారు.
పరిగి అభివృద్ధికి సహకరించాలి
పరిగి పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని 3వ వార్డులో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని మంజూరు చేయించిన రూ.15కోట్లలో రూ.10కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. తాసిల్దార్ కార్యాలయం రోడ్డు బీటీ పనులు ఈనెల మూడవ వారం లోపు పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. ముందస్తుగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అన్నారు. జడ్పీహెచ్ఎస్ -1 నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సీసీ వేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. డివైడర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్ వేముల కిరణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మౌలానా, సాదక్ పాల్గొన్నారు.
గిట్టు బాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి
గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కులకచర్ల సర్పంచ్ సౌమ్యారెడ్డి, ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఏపీఎం శోభ, సీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు బొంబాయి రాములునాయక్, శంకరయ్య, మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైతుపక్షపాతి సీఎం కేసీఆర్
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని విశ్వనాథ్పూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన వెంట మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భీమప్ప, బుడిగ జంగం జిల్లా అధ్యక్షుడు బీజే యాదప్ప, సర్పంచ్ పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలుకు టోకెన్ల పంపిణీ
దోమ, మే 3 : మండల పరిధిలోని దోర్నాల్పల్లి గ్రామంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలుకు రైతులకు టోకెన్లను ఏఈవో దుర్గాప్రసన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని విక్రయించాలంటే ముందుగా గ్రామ ఏఈవోల వద్ద టోకెన్లు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్ యాదయ్యసాగర్, రైతులు ఉన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దోమ, మే 3 : కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని రైతులు మద్ధతు ధర పొందాలని సర్పంచ్ జగని వెంకటయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ జగని వెంకటయ్య వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సీసీ లక్ష్మారెడ్డి, వివో భీమమ్మ, టీఆర్ఎస్ యువ నాయకుడు రాఘవేందర్రెడ్డి, బోయ సాయిలు గ్రామ రైతులు పాల్గొన్నారు.